News

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేతీరు


రైతుల సమస్యల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశెఖర్ రావు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే తీరుగా ఉన్నారని మాజీ మంంత్రి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు. రైతుల రుణ మాపీ పూర్తిగా జరగక రెండు రాస్ట్రాలలో ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. రైతుల విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని ఆయన కోరారు. రైతులను ఆదుకోవడం కాకుండా, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో ముందుగా పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు.